ETV Bharat / state

విద్యుత్ ఛార్జీల పెంపుపై కదం తొక్కిన టీడీపీ.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

author img

By

Published : Apr 10, 2023, 6:58 PM IST

TDP Protests on electricity tariff hike: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు కదం తొక్కారు. వైసీపీ పాలనలో 7 సార్లు ధరలు పెంచి, ప్రజలపై 57 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. జగన్ కుటుంబ బినామీ కంపెనీలకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తూ.. విద్యుత్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. విద్యుత్ బాదుడు ఆపాలంటూ, సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా చేపట్టారు.

Etv Bharat
Etv Bharat
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కదం తొక్కిన తెలుగుదేశం

electricity tariff hike: పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వివిధ జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు, నేతలు రోడ్డపైకి వచ్చి పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు.

విజయవాడ: బొండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా మాట్లాడుతూ.. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా జగన్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పన్నుల, ఛార్జీల భారాలతో ప్రజలను దోచేస్తున్నారని మండిపడ్డారు. నాడు బాదుడే బాదుడు అన్న జగన్.. నేడు ప్రజలను ఛార్జీల పెంపుతో, పన్నుల భారాలతో బాదేస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 56 వేల కోట్లు భారం మోపారన్నారు. విద్యుత్ బిల్లుల పెంపులో జగన్ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. ట్రూ అప్ చార్జి అంటే అసలు బిల్లు ఇచ్చే వాళ్లకైనా తెలుసా అని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు.

కన్నా: జగన్ ఒక్క రోజు సీఎంగా ఉన్నా..రాష్ట్రానికి శాపమని తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. జగన్ అవినీతి దాహం వల్లే, విద్యుత్ ఛార్జీల భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లల్లో కమిషన్ ద్వారా 6 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఏయే శాఖల్లో ఎంత అప్పులు తెచ్చారు.. ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం భగ్గుమంది. ధరల పెంపును నిరసిస్తూ.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నేతలు ఆందోళన చేపట్టారు. భారం తగ్గించాలంటూ.. కొండపల్లి విద్యుత్ సబ్​స్టేషన్ వద్ద దేవినేని ఉమ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. 57 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిన జగన్​ను ఎందుకు నమ్మాలని నేతలు నిలదీశారు.

కర్నూలు జిల్లా: విద్యుత్ ఛార్జీలపై కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశం ఆందోళన నిర్వహించింది. విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఛార్జీలు తగ్గించాలంటూ నెల్లూరులో టీడీపీ నేతలు.. విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ట్రూ ఆఫ్ చార్జీల పేరిట పేదల నడ్డి విరుస్తున్నారని అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రజలపై భారం తగ్గించేవరకు పోరాడతామన్నారు.

గోదావరి జిల్లాలు: తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ శ్రేణులు నిరసన బాట పట్టాయి. దుప్పలపూడి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. ఛార్జీలు తగ్గించాలని... కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచకపోగా విద్యుత్ కోతలు పెంచారని నేతలు మండిపడ్డారు.

అన్నమయ్య జిల్లా: జగన్ పాలనలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ట్రూప్ ఆప్ ఛార్జీలంటూ పేదల సొమ్మును దోజేస్తున్నారంటూ రాజంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించొద్దంటూ అధికారులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించారు.

శ్రీకాకుళం జిల్లా: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. యూనిట్ విద్యుత్ పై 40 పైసాలు పెంచుతున్నారంటూ.. పలాసలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గౌతు శిరీష ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాతపట్నంలో విద్యుత్ ఉపకేంద్రం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి.. వినతిపత్రం అందించారు. టీడీపీ శ్రేణులు ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని నరసన్నపేటలో నేతలు డిమాండ్ చేశారున్నారు.

నర్సీపట్నం: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ అనకాపల్లి జిల్లాలోనూ టీడీపీ నేతలు నిరసనలతో హోరెత్తించారు. విద్యుత్‌పై బాదుడు ఆపాలంటూ నర్సీపట్నం ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. విద్యుత్‌ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కదం తొక్కిన తెలుగుదేశం

electricity tariff hike: పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వివిధ జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు, నేతలు రోడ్డపైకి వచ్చి పెంచిన ఛార్జీలు తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు.

విజయవాడ: బొండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా మాట్లాడుతూ.. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా జగన్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు పన్నుల, ఛార్జీల భారాలతో ప్రజలను దోచేస్తున్నారని మండిపడ్డారు. నాడు బాదుడే బాదుడు అన్న జగన్.. నేడు ప్రజలను ఛార్జీల పెంపుతో, పన్నుల భారాలతో బాదేస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 56 వేల కోట్లు భారం మోపారన్నారు. విద్యుత్ బిల్లుల పెంపులో జగన్ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. ట్రూ అప్ చార్జి అంటే అసలు బిల్లు ఇచ్చే వాళ్లకైనా తెలుసా అని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు.

కన్నా: జగన్ ఒక్క రోజు సీఎంగా ఉన్నా..రాష్ట్రానికి శాపమని తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. జగన్ అవినీతి దాహం వల్లే, విద్యుత్ ఛార్జీల భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్లల్లో కమిషన్ ద్వారా 6 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఏయే శాఖల్లో ఎంత అప్పులు తెచ్చారు.. ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం భగ్గుమంది. ధరల పెంపును నిరసిస్తూ.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నేతలు ఆందోళన చేపట్టారు. భారం తగ్గించాలంటూ.. కొండపల్లి విద్యుత్ సబ్​స్టేషన్ వద్ద దేవినేని ఉమ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. 57 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిన జగన్​ను ఎందుకు నమ్మాలని నేతలు నిలదీశారు.

కర్నూలు జిల్లా: విద్యుత్ ఛార్జీలపై కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశం ఆందోళన నిర్వహించింది. విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఛార్జీలు తగ్గించాలంటూ నెల్లూరులో టీడీపీ నేతలు.. విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ట్రూ ఆఫ్ చార్జీల పేరిట పేదల నడ్డి విరుస్తున్నారని అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రజలపై భారం తగ్గించేవరకు పోరాడతామన్నారు.

గోదావరి జిల్లాలు: తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ శ్రేణులు నిరసన బాట పట్టాయి. దుప్పలపూడి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. ఛార్జీలు తగ్గించాలని... కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచకపోగా విద్యుత్ కోతలు పెంచారని నేతలు మండిపడ్డారు.

అన్నమయ్య జిల్లా: జగన్ పాలనలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ట్రూప్ ఆప్ ఛార్జీలంటూ పేదల సొమ్మును దోజేస్తున్నారంటూ రాజంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించొద్దంటూ అధికారులకు విజ్ఞాపన పత్రాలు సమర్పించారు.

శ్రీకాకుళం జిల్లా: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. యూనిట్ విద్యుత్ పై 40 పైసాలు పెంచుతున్నారంటూ.. పలాసలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గౌతు శిరీష ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పాతపట్నంలో విద్యుత్ ఉపకేంద్రం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి.. వినతిపత్రం అందించారు. టీడీపీ శ్రేణులు ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని నరసన్నపేటలో నేతలు డిమాండ్ చేశారున్నారు.

నర్సీపట్నం: విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ అనకాపల్లి జిల్లాలోనూ టీడీపీ నేతలు నిరసనలతో హోరెత్తించారు. విద్యుత్‌పై బాదుడు ఆపాలంటూ నర్సీపట్నం ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. విద్యుత్‌ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.