ETV Bharat / state

పట్టాలు తప్పిన రైలింజిన్‌.. రైళ్ల రాకపోకల ఆలస్యం - కర్నూలు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

కర్నూలు నగర పరిధిలోని కేసీ కాల్వ వద్ద కాచిగూడ నుంచి డోన్ వెళ్తున్న లోకోమోటివ్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఇంజిన్ నెమ్మదిగా వెళ్తుండడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

train track missing near karnulu district
train track missing near karnulu district
author img

By

Published : Jun 26, 2021, 6:56 AM IST

కాచిగూడ నుంచి డోన్‌కు వెళ్తున్న లోకోమోటివ్‌ రైలు ఇంజిన్‌ శుక్రవారం రాత్రి పట్టాలు తప్పింది. కర్నూలు నగర పరిధిలోని కేసీ కాల్వ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఇంజిన్‌ నెమ్మదిగా వెళ్తున్న వేళ ప్రమాదం జరగడంతో పెద్ద ముప్పు తప్పింది. ఘటనకుగల కారణాలను హైదరాబాద్‌ డివిజినల్‌ మేనేజర్‌తో కూడిన నిపుణుల బృందం అన్వేషించాలని అధికారులు చెప్పారు.

ఆ తర్వాతే రైళ్ల రాకపోకలను అనుమతించాల్సి ఉన్న కారణంగా.. కొన్ని రైళ్లు ఆలస్యంగా తిరగనున్నాయని కర్నూలు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు హైదరాబాద్‌ డివిజన్‌ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో కాచిగూడ నుంచి వెళ్లే చెన్నై ఎగ్మోర్‌, గుంటూరు రైళ్లను గద్వాల స్టేషన్‌లో నిలిపివేశారు. డోన్‌ మీదుగా వెళ్లే కాచిగూడ రైలు సైతం ఆలస్యంగా నడిచింది.

కాచిగూడ నుంచి డోన్‌కు వెళ్తున్న లోకోమోటివ్‌ రైలు ఇంజిన్‌ శుక్రవారం రాత్రి పట్టాలు తప్పింది. కర్నూలు నగర పరిధిలోని కేసీ కాల్వ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఇంజిన్‌ నెమ్మదిగా వెళ్తున్న వేళ ప్రమాదం జరగడంతో పెద్ద ముప్పు తప్పింది. ఘటనకుగల కారణాలను హైదరాబాద్‌ డివిజినల్‌ మేనేజర్‌తో కూడిన నిపుణుల బృందం అన్వేషించాలని అధికారులు చెప్పారు.

ఆ తర్వాతే రైళ్ల రాకపోకలను అనుమతించాల్సి ఉన్న కారణంగా.. కొన్ని రైళ్లు ఆలస్యంగా తిరగనున్నాయని కర్నూలు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు హైదరాబాద్‌ డివిజన్‌ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో కాచిగూడ నుంచి వెళ్లే చెన్నై ఎగ్మోర్‌, గుంటూరు రైళ్లను గద్వాల స్టేషన్‌లో నిలిపివేశారు. డోన్‌ మీదుగా వెళ్లే కాచిగూడ రైలు సైతం ఆలస్యంగా నడిచింది.

ఇదీ చదవండి:

DOUBLE MURDER: జంటహత్యల కేసులో నిందితులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.