ETV Bharat / state

నీటి కుంటలో పడి విద్యార్థి మృతి - నీటిలో పడిన విద్యార్థి

కర్నూలు జిల్లా యాగంటిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితలతో కలిసి ఈతకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతిచెందాడు.

నీటి కుంటలో పడి విద్యార్థి మృతి
నీటి కుంటలో పడి విద్యార్థి మృతి
author img

By

Published : Mar 18, 2020, 8:35 AM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటిపల్లి వద్ద నీటి గుంటలో పడి విద్యార్థి మృతిచెందాడు. స్నేహితులతో కాసేపు సరదాగా గడిపేందుకు నీలి వర్ధన్​ అనే ఎనిమిదో విద్యార్థి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో పైనుంచి దూకి నీటిలో మునిగాడు. అది గమనించిన స్నేహితులు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని వెలికితీశారు. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటిపల్లి వద్ద నీటి గుంటలో పడి విద్యార్థి మృతిచెందాడు. స్నేహితులతో కాసేపు సరదాగా గడిపేందుకు నీలి వర్ధన్​ అనే ఎనిమిదో విద్యార్థి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో పైనుంచి దూకి నీటిలో మునిగాడు. అది గమనించిన స్నేహితులు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని వెలికితీశారు. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.