ETV Bharat / state

జగన్​పై వర్ల రామయ్య ఫిర్యాదు... కాల్​ సెంటర్​కే ఫోన్..!

author img

By

Published : Nov 26, 2019, 5:01 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై... తెదేపా సీనియర్ నేత వర్లరామయ్య మండిపడ్డారు. జగన్ అక్రమార్జనపై కాల్​సెంటర్​కు ఫోన్ చేసి ... అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు.

varla
వర్లరామయ్య

వర్లరామయ్య

ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదు చేయటానికి 14400 టోల్ ఫ్రీ నెంబర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్​కు తెదేపా సీనియర్ నేత... వర్లరామయ్య ఫోన్ చేశారు. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43వేల కోట్లు సంపాదించారని ఆరోపించిన వర్లరామయ్య... రాజకీయ అవినీతిపై అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.

ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బందికి సూచించారు. సీఎం ప్రకటించినట్లుగా తన ఫిర్యాదు పైనా 15రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. తనపై అభియోగాలు పెట్టుకొని అవినీతిని అంతమొందిస్తానని జగన్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. తనపై తానే అధ్యయనం చేయించుకుంటానని సీఎం స్వచ్ఛందంగా ముందుకు రావాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

వర్లరామయ్య

ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదు చేయటానికి 14400 టోల్ ఫ్రీ నెంబర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్​కు తెదేపా సీనియర్ నేత... వర్లరామయ్య ఫోన్ చేశారు. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43వేల కోట్లు సంపాదించారని ఆరోపించిన వర్లరామయ్య... రాజకీయ అవినీతిపై అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.

ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బందికి సూచించారు. సీఎం ప్రకటించినట్లుగా తన ఫిర్యాదు పైనా 15రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. తనపై అభియోగాలు పెట్టుకొని అవినీతిని అంతమొందిస్తానని జగన్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. తనపై తానే అధ్యయనం చేయించుకుంటానని సీఎం స్వచ్ఛందంగా ముందుకు రావాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేదా? : వర్ల రామయ్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.