ETV Bharat / state

వ్యక్తి మెడ భాగంలో దిగిన ఇనుపకడ్డీ... రక్షించిన సన్ రైజ్ వైద్యులు

author img

By

Published : Nov 20, 2020, 7:49 AM IST

మెడభాగం నుంచి చెవిలోకి ఇనుపకడ్డీ గుచ్చుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులు రక్షించారు. అధునాతన తరహాలో శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. తన కుమారుడిని రక్షించినందుకు బాధితుడి తండ్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sunrise Hospital Rare Operation
Sunrise Hospital Rare Operation

కృష్ణాజిల్లా మూలపాడుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి అర్ధరాత్రి ఇంటి మెట్లెక్కుతూ జారి.. ఇనుపసువ్వలపై పడ్డాడు. ఈ ఘటనలో ఇనుపసువ్వ మెడ భాగం నుంచి చెవిలోకి దూసుకెళ్లింది. అర్థరాత్రి సమయంలో బాధితుణ్ని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. సన్ రైజ్ ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్స అందించారు. వివిధ పరీక్షలు చేసి లాప్రోస్కోపి ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించారు.

ఈఎన్​టీ వైద్యులు డా. నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం నాలుగు గంటలు శ్రమించి ఇనుప చవ్వను తీశారు. అయితే మెదడుకు సంబంధించిన నరం పక్క నుంచి చువ్వ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. బాధితుడి స్వరపేటిక దెబ్బతిందని... ఓ కంటికి పక్షవాతం వచ్చిందని వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామకృష్ణను వైద్య బృందం శ్రమించటంతో రక్షించకలిగామన్నారు.

ప్రస్తుతం రామారావు మెల్లమెల్లగా కోలుకుంటున్నాడని... ఇంకా మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని డా. నరేంద్ర తెలిపారు. కరోనా సమయంలో ఈ తరహా శస్త్రచికిత్స చేయటం కత్తిమీద సాములాంటిదన్నారు. ప్రాణాపాయంలో ఉన్న తమ కుమారుణ్ని రక్షించారని బాధితుడి తండ్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం

కృష్ణాజిల్లా మూలపాడుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి అర్ధరాత్రి ఇంటి మెట్లెక్కుతూ జారి.. ఇనుపసువ్వలపై పడ్డాడు. ఈ ఘటనలో ఇనుపసువ్వ మెడ భాగం నుంచి చెవిలోకి దూసుకెళ్లింది. అర్థరాత్రి సమయంలో బాధితుణ్ని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. సన్ రైజ్ ఆసుపత్రి సిబ్బంది వెంటనే చికిత్స అందించారు. వివిధ పరీక్షలు చేసి లాప్రోస్కోపి ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించారు.

ఈఎన్​టీ వైద్యులు డా. నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం నాలుగు గంటలు శ్రమించి ఇనుప చవ్వను తీశారు. అయితే మెదడుకు సంబంధించిన నరం పక్క నుంచి చువ్వ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. బాధితుడి స్వరపేటిక దెబ్బతిందని... ఓ కంటికి పక్షవాతం వచ్చిందని వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామకృష్ణను వైద్య బృందం శ్రమించటంతో రక్షించకలిగామన్నారు.

ప్రస్తుతం రామారావు మెల్లమెల్లగా కోలుకుంటున్నాడని... ఇంకా మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని డా. నరేంద్ర తెలిపారు. కరోనా సమయంలో ఈ తరహా శస్త్రచికిత్స చేయటం కత్తిమీద సాములాంటిదన్నారు. ప్రాణాపాయంలో ఉన్న తమ కుమారుణ్ని రక్షించారని బాధితుడి తండ్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజులు వసూలుకు సిద్ధమైన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.