ETV Bharat / state

కరోనా సోకడంతో పురుగు మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య - కరోనా మృత దేహానికి అవనిగడ్డ ఎస్సై అంత్యక్రియలు

కరోనా సోకడంతో ఆందోళనకు గురైన ఓ వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి అంత్య క్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ ఎస్సై పీపీఈ కిట్​ ధరించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఈ ఘటన జరిగింది.

avanigadda si during funerals
కరోనా మృతుడికి అంత్యక్రియలు చేస్తున్న అవనిగడ్డ ఎస్సై
author img

By

Published : Oct 21, 2020, 10:16 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి.. మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంటి వద్ద అతడు ఒంటరిగా ఉంటున్నాడు. వైరస్ సోకిందనే భయంతో మానసిక వేదనకు గురవుతున్నాడు. సోమవారం రాత్రి పురుగుల మందు తాగి మరణించాడు. వైరస్ భయంతో.. అంత్యక్రియలు నిర్వహించడానికి మృతుడి బంధువులు వెనకడుగు వేశారు. బంధువుల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు అవనిగడ్డ ఎస్సై సందీప్​ పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. తహసీల్దార్ సమక్షంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు.అంత్య క్రియలు నిర్వహించిన ఎస్సైను.. గ్రామస్థులు, పోలీసు అధికారులు అభినందించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి.. మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంటి వద్ద అతడు ఒంటరిగా ఉంటున్నాడు. వైరస్ సోకిందనే భయంతో మానసిక వేదనకు గురవుతున్నాడు. సోమవారం రాత్రి పురుగుల మందు తాగి మరణించాడు. వైరస్ భయంతో.. అంత్యక్రియలు నిర్వహించడానికి మృతుడి బంధువులు వెనకడుగు వేశారు. బంధువుల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు అవనిగడ్డ ఎస్సై సందీప్​ పీపీఈ కిట్ ధరించి అంత్యక్రియలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. తహసీల్దార్ సమక్షంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్నారు.అంత్య క్రియలు నిర్వహించిన ఎస్సైను.. గ్రామస్థులు, పోలీసు అధికారులు అభినందించారు.

ఇదీ చదవండి:

కరోనా సోకిందనే భయంతో శానిటైజర్​ తాగిన యువతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.