ఉపాధిహామీ పథకం కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రోజు వారీ కూలీని రూ.211 నుంచి రూ. 237 పెంచింది. ఈ పెంపుతో వేతనం 26 రూపాయల మేర పెరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వర్తించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
![Employment labour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6970371_453_6970371_1588057499006.png)