ETV Bharat / state

అవనిగడ్డలో నూతన రైతుబజార్ ప్రారంభం

కృష్ణా జిల్లా అవనిగడ్డలో నూతనంగా నిర్మించిన రైతుబజార్​ను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ధరల పట్టిక ప్రకారమే రైతులు కూరగాయలు విక్రయించాలని తెలిపారు.

author img

By

Published : Apr 27, 2020, 3:59 PM IST

New raithu bazaar begins in Avinigadda
అవనిగడ్డలో నూతన రైతుబజార్ ప్రారంభం

కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్​ను.. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు ఈ రైతు బజార్​ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. లాక్​డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు.. కూరగాయలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతుబజార్​ల సంఖ్యను పెంచారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల పట్టిక ప్రకారమే కూరగాయలు విక్రయించాలని సూచించారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్​ను.. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు ఈ రైతు బజార్​ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. లాక్​డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు.. కూరగాయలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతుబజార్​ల సంఖ్యను పెంచారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల పట్టిక ప్రకారమే కూరగాయలు విక్రయించాలని సూచించారు. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

రిషికేశ్​లో ముగిసిన కమలేశ్​ అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.