ETV Bharat / state

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములను ఉపేక్షించొద్దు: హైకోర్టు

కరోనా విషయంలో తీసుకున్న ప్రతి చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని స్వీయ ధ్రువీకరణ చేసుకోవద్దని పేర్కొంది . అంతా నియంత్రణలోనే ఉందన్న భావన వద్దని హెచ్చరించింది.

author img

By

Published : Apr 29, 2021, 5:11 AM IST

Updated : Apr 29, 2021, 5:49 AM IST

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములను ఉపేక్షించొద్దు: హైకోర్టు
ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములను ఉపేక్షించొద్దు: హైకోర్టు


కరోనా విషయంలో తీసుకున్న ప్రతి చర్యనూ సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సొంత కితాబు ఇచ్చుకోవద్దని పేర్కొంది. లోపాల్ని సరిదిద్దుకొని మరింత మెరుగైన సేవలు ఎలా అందించవచ్చో ఆలోచించాలంది. అంతా నియంత్రణలో ఉందనే భావన వద్దని హితవు పలికింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుముల వసూలును, బెడ్‌లు నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. చేర్చుకోవడానికి అధిక రుసుము డిమాండ్‌ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములను ఉపేక్షించొద్దు: హైకోర్టు

ఆసుపత్రిలో చేరే విషయంలో సమస్య తలెత్తితే.. సంప్రదించేందుకు నోడల్‌ అధికారి పేరు, ఫోన్‌ నంబరు ప్రదర్శించాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో అక్రమాలపై నియమించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎన్ని తనిఖీలు చేసిందో.. ఏం గమనించిందో మోమో దాఖలు చేయాలని స్పష్టంచేసింది. నోడల్‌ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాన్నీ పరిశీలించాలని తెలిపింది. విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాబోయే రోజుల్లో కేసులు పెరిగితే ఆక్సిజన్‌, బెడ్‌ల కొరత, సౌకర్యాల లేమిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పింది. పరిస్థితులు చేయి దాటకూడదనేది తమ అభిప్రాయమని పేర్కొంది.

కరోనా బాధితులకు ఐసొలేషన్‌ కేంద్రాల్లో ప్రవేశం కల్పించడం లేదని కొన్ని ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విచారణ మే 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా విషయమై సామాజిక కార్యకర్త, పాత్రికేయుడు తోట సురేశ్‌బాబు, ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలుచేశారు. వీటిపై హైకోర్టు బుధవారం లోతైన విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పొత్తూరి సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘కొన్ని ఆసుపత్రుల్లో బెడ్‌లు నిరాకరిస్తున్నారు.

విజయవాడలో ఓ వ్యక్తి ఐసొలేషన్‌ కేంద్రంలో చేరేందుకు యత్నించగా నిరాకరించారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నా.. ఖాళీల సంఖ్యను ప్రకటించడం లేదు. ఫిర్యాదు చేద్దామంటే నోడల్‌ అధికారులు ఫోన్లకు స్పందించడం లేదు. రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సుమన్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వివరాలతో కౌంటర్‌ వేశామన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోలను మెమో ద్వారా దాఖలు చేశామన్నారు.

ఆక్సిజన్‌ కొరత లేదు: ప్రభుత్వం
‘ఆక్సిజన్‌ కొరత లేదు. విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు వివిధ వనరుల నుంచి లభ్యమవుతోంది. రోజుకు 480 టన్నుల ఆక్సిజన్‌ లభ్యత ఉంది. నిల్వట్యాంకుల సామర్థ్యం పెంచుతున్నాం. రవాణాకు వాహనాల సంఖ్యను పెంచాం’ అన్నారు. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు.. మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను గుర్తిస్తున్నామని బదులిచ్చారు. ఒకటి, రెండు గదుల్లో ఉండే కుటుంబాల్లో కరోనా బారిన పడినవారి కోసం ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. ఏజీ స్పందిస్తూ ఈ విషయాన్ని వైద్యశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళతామన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు 34 వేలు ఉన్నాయని, మరో 8 లక్షలు సమకూర్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కొవిడ్‌ పరీక్ష ఫలితాల ఆలస్యంపై ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్ష చేయించుకున్న చాలారోజులకు శాంపిల్స్‌ ఇచ్చినట్లు ఎస్‌ఎంఎస్‌ వచ్చిందని సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి స్వీయ అనుభవాన్ని తెలిపారు. జీపీ సుమన్‌ జోక్యం చేసుకుంటూ.. రోజంతా తీసుకున్న నమూనాలను ఆ రోజు సాయంత్రం ల్యాబ్‌లకు పంపుతున్నామన్నారు. పరీక్షించడానికి ఆరు గంటలే అయినా.. రవాణాకు ఎక్కువ సమయం పోతోందన్నారు.

ఇవీ చదవండి

మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్


కరోనా విషయంలో తీసుకున్న ప్రతి చర్యనూ సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సొంత కితాబు ఇచ్చుకోవద్దని పేర్కొంది. లోపాల్ని సరిదిద్దుకొని మరింత మెరుగైన సేవలు ఎలా అందించవచ్చో ఆలోచించాలంది. అంతా నియంత్రణలో ఉందనే భావన వద్దని హితవు పలికింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుముల వసూలును, బెడ్‌లు నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేసింది. చేర్చుకోవడానికి అధిక రుసుము డిమాండ్‌ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములను ఉపేక్షించొద్దు: హైకోర్టు

ఆసుపత్రిలో చేరే విషయంలో సమస్య తలెత్తితే.. సంప్రదించేందుకు నోడల్‌ అధికారి పేరు, ఫోన్‌ నంబరు ప్రదర్శించాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో అక్రమాలపై నియమించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎన్ని తనిఖీలు చేసిందో.. ఏం గమనించిందో మోమో దాఖలు చేయాలని స్పష్టంచేసింది. నోడల్‌ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాన్నీ పరిశీలించాలని తెలిపింది. విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాబోయే రోజుల్లో కేసులు పెరిగితే ఆక్సిజన్‌, బెడ్‌ల కొరత, సౌకర్యాల లేమిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పింది. పరిస్థితులు చేయి దాటకూడదనేది తమ అభిప్రాయమని పేర్కొంది.

కరోనా బాధితులకు ఐసొలేషన్‌ కేంద్రాల్లో ప్రవేశం కల్పించడం లేదని కొన్ని ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విచారణ మే 4కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా విషయమై సామాజిక కార్యకర్త, పాత్రికేయుడు తోట సురేశ్‌బాబు, ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలుచేశారు. వీటిపై హైకోర్టు బుధవారం లోతైన విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పొత్తూరి సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘కొన్ని ఆసుపత్రుల్లో బెడ్‌లు నిరాకరిస్తున్నారు.

విజయవాడలో ఓ వ్యక్తి ఐసొలేషన్‌ కేంద్రంలో చేరేందుకు యత్నించగా నిరాకరించారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నా.. ఖాళీల సంఖ్యను ప్రకటించడం లేదు. ఫిర్యాదు చేద్దామంటే నోడల్‌ అధికారులు ఫోన్లకు స్పందించడం లేదు. రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సుమన్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వివరాలతో కౌంటర్‌ వేశామన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోలను మెమో ద్వారా దాఖలు చేశామన్నారు.

ఆక్సిజన్‌ కొరత లేదు: ప్రభుత్వం
‘ఆక్సిజన్‌ కొరత లేదు. విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు వివిధ వనరుల నుంచి లభ్యమవుతోంది. రోజుకు 480 టన్నుల ఆక్సిజన్‌ లభ్యత ఉంది. నిల్వట్యాంకుల సామర్థ్యం పెంచుతున్నాం. రవాణాకు వాహనాల సంఖ్యను పెంచాం’ అన్నారు. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు.. మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను గుర్తిస్తున్నామని బదులిచ్చారు. ఒకటి, రెండు గదుల్లో ఉండే కుటుంబాల్లో కరోనా బారిన పడినవారి కోసం ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. ఏజీ స్పందిస్తూ ఈ విషయాన్ని వైద్యశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళతామన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు 34 వేలు ఉన్నాయని, మరో 8 లక్షలు సమకూర్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కొవిడ్‌ పరీక్ష ఫలితాల ఆలస్యంపై ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్ష చేయించుకున్న చాలారోజులకు శాంపిల్స్‌ ఇచ్చినట్లు ఎస్‌ఎంఎస్‌ వచ్చిందని సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి స్వీయ అనుభవాన్ని తెలిపారు. జీపీ సుమన్‌ జోక్యం చేసుకుంటూ.. రోజంతా తీసుకున్న నమూనాలను ఆ రోజు సాయంత్రం ల్యాబ్‌లకు పంపుతున్నామన్నారు. పరీక్షించడానికి ఆరు గంటలే అయినా.. రవాణాకు ఎక్కువ సమయం పోతోందన్నారు.

ఇవీ చదవండి

మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్

Last Updated : Apr 29, 2021, 5:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.