కుటుంబ గొడవల నేపథ్యంలో.. కృష్ణా జిల్లా బాపులపాడు మంలం పెరికీడులో కన్నకొడుకునే తండ్రి హతమార్చాడు. వ్యవసాయం చేసుకొనే వీరస్వామికి, అతని కుమారుడు శివకృష్ణకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండేవి. ఆదివారం సాయంత్రం కుమారుడు నిద్రిస్తుండగా గొడ్డలితో దాడి చేశాడు.
ఈ ఘటనలో శివకృష్ణ తీవ్రంగా గాయపడగా.. తొలుత హనుమాన్ జంక్షన్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యానికి విజయవాడకు తీసుకెళ్తుండగా అతను మరణించాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి: