ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంసెట్, ఈసెట్, పీజీసెట్, లాసెట్,ఎడ్సెట్లను ఒకే వారంలో పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 15నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు. అనంతరం డిగ్రీ ఒకటి, రెండు సంవత్సరాలు, బీటెక్ మూడేళ్లు, పీజీ మొదటి ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30లోపు డీగ్రీ, పీజీ, బీటెక్ చివరి ఏడాది సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయనున్నారు.
ఇదీ చూడండి. 'రాష్ట్రానికి రూ. 9 లక్షల కోట్ల నిధులివ్వండి'