ETV Bharat / state

అమరావతి ద్రోహులు రాజీనామా చేయాలి: రైతులు

మందడం గ్రామంలో 234వ రోజు అమరావతి రైతులు నిరసన దీక్ష కొనసాగించారు. అమరావతి ఎక్కడికీ వెళ్లదంటూ హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్న నాయకులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

author img

By

Published : Aug 7, 2020, 3:13 PM IST

amaravathi protest in mandadam
అమరావతి రైతుల ధర్నా

మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరంలో కూర్చుని అమరావతి ద్రోహులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు అమరావతి అంగుళం కూడా కదలదంటూ హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడేమయ్యారంటూ రైతన్నలు ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు.. నేతలకు తమ తరఫు నుంచి బహుమతిగా గాజులు, చీర, పూలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి నాయకుల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి....

మందడంలో రైతులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరంలో కూర్చుని అమరావతి ద్రోహులు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు అమరావతి అంగుళం కూడా కదలదంటూ హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడేమయ్యారంటూ రైతన్నలు ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు.. నేతలకు తమ తరఫు నుంచి బహుమతిగా గాజులు, చీర, పూలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి నాయకుల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి....

మడకశిర సచివాలయంలో పుట్టినరోజు వేడుకలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.