ETV Bharat / state

గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్.. 11 మంది అరెస్టు

author img

By

Published : Apr 21, 2021, 7:54 PM IST

గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని దర్శిపేటలో బెట్టింగ్​కు పాల్పడిన 11 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

11 arrested in cricket betting
క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు

ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. బెట్టింగ్​రాయుళ్లు పందేలకు సిద్ధమయ్యారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది సభ్యులు దర్శిపేటలో రేకుల షెడ్డును బెట్టింగ్​లకు అడ్డాగా మార్చుకున్నారు. ఆన్​లైన్ యాప్​లను వినియోగిస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారమందుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు.. దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 11 సెల్​ఫోన్లు, ల్యాప్​ టాప్​ను స్వాధీనం చేసుకున్నారు.

తొంట్ల సత్యనారాయణ అనే నిందితుడు.. కిరణ్ అనే వ్యక్తి ద్వారా క్రికెట్ బెట్టింగ్​కు సంబంధించిన పరికరాలను తీసుకొని ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాకానీ బాజిబాబు అనే వ్యక్తికి 10 శాతం కమిషన్​పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులను గాలించేందుకు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్​ఫోర్స్ ఏసీపీ రమణ మూర్తి తెలిపారు.

ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. బెట్టింగ్​రాయుళ్లు పందేలకు సిద్ధమయ్యారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది సభ్యులు దర్శిపేటలో రేకుల షెడ్డును బెట్టింగ్​లకు అడ్డాగా మార్చుకున్నారు. ఆన్​లైన్ యాప్​లను వినియోగిస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారమందుకున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు.. దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 11 సెల్​ఫోన్లు, ల్యాప్​ టాప్​ను స్వాధీనం చేసుకున్నారు.

తొంట్ల సత్యనారాయణ అనే నిందితుడు.. కిరణ్ అనే వ్యక్తి ద్వారా క్రికెట్ బెట్టింగ్​కు సంబంధించిన పరికరాలను తీసుకొని ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాకానీ బాజిబాబు అనే వ్యక్తికి 10 శాతం కమిషన్​పై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులను గాలించేందుకు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్​ఫోర్స్ ఏసీపీ రమణ మూర్తి తెలిపారు.

ఇవీ చూడండి...

'ప్రభుత్వం తక్షణమే మద్యం దుకాణాలను మూసివేయాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.