ETV Bharat / state

'యోగాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది'

యోగ ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని... ప్రతిరోజు ప్రాణాయామ యోగాను అవలంబిస్తే వైరస్​లు దరి చేరవని ఇండియన్ యోగా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పతంజలి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు, అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ చల్లా అనూరాధ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

author img

By

Published : Jul 14, 2020, 4:41 PM IST

yoga awareness class in guntur
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగ శిక్షణ తరగతులు

కరోనా నియంత్రణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు, అవగాహన సదస్సు నిర్వహించారు. సంపత్ నగర్​లో నిర్వహించిన కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ చల్లా అనూరాధ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఇండియన్ యోగా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పతంజలి శ్రీనివాస్ కరోనా వైరస్​ను ఎదుర్కోవడానికి అవసరమైన యోగాసనాలను.. యోగా వలన కలిగే ప్రయోజనాలను నగరపాలక సిబ్బందికి వివరించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనా వైరస్​ని విజయవంతంగా ఎదుర్కోవచ్చని శ్రీనివాస్ అన్నారు.

గుంటూరు నగరంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో అన్ని విధాలా చర్యలు చేపట్టామని జీఎంసీ కమిషనర్ చల్లా అనూరాధ వెల్లడించారు. రానున్న కాలంలో నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల వారికి విడతల వారిగా యోగా అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగాలోని ప్రాణాయామం, ఆహార, నీటి నియమాలను ఎంతో చక్కగా వివరించిన పతంజలి శ్రీనివాస్​కి ఆమె ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి...

బ్రాడీపేట కంటైన్మెంట్ జోన్ వద్ద ప్రజల ఇక్కట్లు

కరోనా నియంత్రణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు, అవగాహన సదస్సు నిర్వహించారు. సంపత్ నగర్​లో నిర్వహించిన కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ చల్లా అనూరాధ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఇండియన్ యోగా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పతంజలి శ్రీనివాస్ కరోనా వైరస్​ను ఎదుర్కోవడానికి అవసరమైన యోగాసనాలను.. యోగా వలన కలిగే ప్రయోజనాలను నగరపాలక సిబ్బందికి వివరించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనా వైరస్​ని విజయవంతంగా ఎదుర్కోవచ్చని శ్రీనివాస్ అన్నారు.

గుంటూరు నగరంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో అన్ని విధాలా చర్యలు చేపట్టామని జీఎంసీ కమిషనర్ చల్లా అనూరాధ వెల్లడించారు. రానున్న కాలంలో నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల వారికి విడతల వారిగా యోగా అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగాలోని ప్రాణాయామం, ఆహార, నీటి నియమాలను ఎంతో చక్కగా వివరించిన పతంజలి శ్రీనివాస్​కి ఆమె ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి...

బ్రాడీపేట కంటైన్మెంట్ జోన్ వద్ద ప్రజల ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.