గుంటూరుకు చెందిన దివ్య మూడేళ్ల క్రితం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో సంగీతం కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలో అదే కళాశాలలో చదువుతున్న అహమ్మద్ తౌసీఫ్ అలియాస్ తారక్ అనే వ్యక్తి దివ్యకు పరిచమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదురించి తౌసీఫ్ను వివాహం చేసుకుంది.
అనంతరం దివ్య తౌసీఫ్తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. అక్కడ వారం రోజులు ఉన్న తర్వాత తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని తౌసీఫ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వెళ్లాడు. కొద్దిరోజుల తర్వాత దివ్యనూ ఎమ్మిగనూరు తీసుకువెళ్లాడు. ఇంటికి వెళ్లిన అనంతరం దివ్యను ఇస్లాం మతంలోకి మారాలంటూ కుటుంబంసభ్యులతో కలిసి వేధింపులకు గురిచేశాడు.
ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి.. సంతోషంగా చూసుకుంటాడు అనుకుంటే, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. తనను వేధింపులకు గురి చేసిన తౌసీఫ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరిగినట్లు ఇంకా ఎవరికీ జరగవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. హిందూ సంఘాల నేతలు, సినీ నటి కరాటే కళ్యాణి బాధితురాలికి అండగా నిలిచారు.
ఇదీచదవండి. సీఎం ముఖ్యసలహాదారు నీలం సాహ్నికి వేతనం నిర్ధారిస్తూ ఉత్తర్వులు