ETV Bharat / state

'పేదలకు ఇళ్ల స్థలాల పేరిట అవినీతికి పాల్పడ్డారు'

author img

By

Published : Jun 4, 2021, 10:49 PM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పేరిట వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు.

nakka
nakka

రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం పేరిట వైకాపా నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వైకాపా నేతల ఆస్తులు రెండింతలు పెరిగాయని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో రూ.3వేలకు ఫించన్ పెంచుతానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్... కేవలం రూ.250 పెంచి వృద్ధులు, వితంతువులను మోసం చేశారని విమర్శించారు. 80 లక్షల మందికి ఇవ్వాల్సిన అమ్మఒడిని 43లక్షల మందికి కుదించారని ఆక్షేపించారు.

రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం పేరిట వైకాపా నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వైకాపా నేతల ఆస్తులు రెండింతలు పెరిగాయని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో రూ.3వేలకు ఫించన్ పెంచుతానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్... కేవలం రూ.250 పెంచి వృద్ధులు, వితంతువులను మోసం చేశారని విమర్శించారు. 80 లక్షల మందికి ఇవ్వాల్సిన అమ్మఒడిని 43లక్షల మందికి కుదించారని ఆక్షేపించారు.

ఇదీచదవండి.

భారీగా అద్దెలు.. ముందుకు వచ్చేందుకు జంకుతున్న వ్యాపారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.