ETV Bharat / state

'ప్రజా రాజధానిని మహిళలు శాశ్వతం చేస్తారు'

author img

By

Published : Oct 31, 2020, 6:51 PM IST

జైల్​భరో కార్యక్రమంలో అమరావతి మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మహిళలపై దుశ్శాసనపర్వం సాగుతోందని దుయ్యబట్టారు. ప్రజా రాజధాని కల మహిళలు శాశ్వతం చేస్తారని లోకేశ్ ఆకాంక్షించారు.

tdp leader nara lokesh on amaravathi
నారా లోకేశ్

అయిదు కోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్లజూస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేయటంతో పాటు వారి త్యాగాల పునాదిని సమాధి చేసే కుట్రలు పన్నారని ఆక్షేపించారు. మహిళలపై దుశ్శాసనపర్వం సాగుతోందని ధ్వజమెత్తారు.

దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం జరుగుతోందని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు జగన్ పతనాన్ని శాసిస్తారని హెచ్చరించారు. ప్రజా రాజధానిని వారు శాశ్వతం చేస్తారని ఆకాంక్షించారు. మహిళలపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్​కు జత చేశారు.

ఇదీ చదవండి: ముంబై ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్'!

అయిదు కోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్లజూస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేయటంతో పాటు వారి త్యాగాల పునాదిని సమాధి చేసే కుట్రలు పన్నారని ఆక్షేపించారు. మహిళలపై దుశ్శాసనపర్వం సాగుతోందని ధ్వజమెత్తారు.

దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం జరుగుతోందని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు జగన్ పతనాన్ని శాసిస్తారని హెచ్చరించారు. ప్రజా రాజధానిని వారు శాశ్వతం చేస్తారని ఆకాంక్షించారు. మహిళలపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్​కు జత చేశారు.

ఇదీ చదవండి: ముంబై ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.