గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్లో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నరసరావుపేట వెంగళరెడ్డి నగర్కు చెందిన లోమడ మాల్యాద్రి అలియాస్ చంటి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆటోతోపాటు అందులో ఉన్న 60 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సెబీ అధికారులు తెలిపారు. ఆ సరకు విలువ రూ.75వేలు ఉంటుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి:
Polavaram: జంతర్ మంతర్లో పోలవరం నిర్వాసితుల ఆందోళన.. జాతీయ నేతల మద్దతు