గుంటూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు పాఠశాలల వద్ద జొన్నలగడ్డ రాజమోహనరావు ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఆరేళ్లుగా తన సొంత ఖర్చుతో... ద్విచక్రవాహనంపై తిరుగుతూ... దాహార్తులకు చల్లని నీరు అందిస్తున్నాడు. రాజమోహనరావు గుంటూరులోని ఓ గ్యాస్ కంపెనీలో మెకానిక్గా పని చేస్తున్నాడు. తనకొచ్చే కొద్ది నగదుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంపై పలువురు ప్రభుత్వాధికారులు, నగరవాసులు రాజమోహనరావును అభినందిస్తున్నారు. నేటి యువతకు ఆయన ఆదర్శమంటూ కొనియాడుతున్నారు.
ఇదీ చదవండి...