ETV Bharat / state

సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయాలని పిటిషన్ - గుంటూరు లోక్ అదాలత్​లో సీజ్ చేసిన వాహనాలపై వ్యాజ్యం

లాక్​డౌన్ వేళ పోలీసుల సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయించాలని కోరుతూ.. ఇద్దరు న్యాయవాదులు వేసిన పిటిషన్​ను గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ విచారణకు స్వీకరించింది.

petetion in lokadalat on seized vehicles in lockdown in guntur
లాక్ డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు
author img

By

Published : May 23, 2020, 1:17 PM IST

కరోనా లాక్​డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయించాలని.. గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఇద్దరు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్​తో పాటు అర్బన్, గ్రామీణ ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. గుంటూరు బార్ అసోషియేషన్ అధ్యక్షులు చిలుకూరి నరేంద్రబాబు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయసేవాధికార సంస్థ విచారణకు స్వీకరించింది.

లాక్ డౌన్​పై ముందుస్తు సమాచారం లేక రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని... వాటిని రక్షణ లేకుండా మైదానాల్లో ఉంచారని పిటిషన్​లో పేర్కొన్నారు. దీంతో వాహనాలు తుప్పుపట్టి పాడైపోతున్నాయని వివరించారు. ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

కరోనా లాక్​డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయించాలని.. గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఇద్దరు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్​తో పాటు అర్బన్, గ్రామీణ ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. గుంటూరు బార్ అసోషియేషన్ అధ్యక్షులు చిలుకూరి నరేంద్రబాబు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయసేవాధికార సంస్థ విచారణకు స్వీకరించింది.

లాక్ డౌన్​పై ముందుస్తు సమాచారం లేక రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని... వాటిని రక్షణ లేకుండా మైదానాల్లో ఉంచారని పిటిషన్​లో పేర్కొన్నారు. దీంతో వాహనాలు తుప్పుపట్టి పాడైపోతున్నాయని వివరించారు. ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

ఇవీ చదవండి.... రేపటి నుంచి మంగళగిరిలో లాక్ డౌన్ సడలింపులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.