ETV Bharat / state

'తన కులానికి మాత్రమే ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహారం'

author img

By

Published : Jan 6, 2021, 10:14 PM IST

Updated : Jan 6, 2021, 10:42 PM IST

హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్​ ఎందుకు మౌనంగా ఉన్నారని తెలుగుయువత నాయకుడు నాగమల్లేశ్వరరావు విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాడులకు పాల్పడిన వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

nagamalleshwar rao comments on cm jagan
తన కులానికి మాత్రమే ముఖ్యమంత్రి వల్లే జగన్ వ్యవహరం

ముఖ్యమంత్రి జగన్.. తన కులం, మతానికి మాత్రమే సీఎంలాగా వ్యవహరిస్తున్నారని తెలుగుయువత నాయకుడు నాగమల్లేశ్వరరావు విమర్శించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు ఇతర మతస్థులను కించపర్చేలా వ్యవహరించలేదన్నారు.

ఎన్నికల ముందు హిందువుగా మతం మారినట్లు ప్రచారం చేసుకున్న జగన్.. ఇపుడు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్.. తన కులం, మతానికి మాత్రమే సీఎంలాగా వ్యవహరిస్తున్నారని తెలుగుయువత నాయకుడు నాగమల్లేశ్వరరావు విమర్శించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు ఇతర మతస్థులను కించపర్చేలా వ్యవహరించలేదన్నారు.

ఎన్నికల ముందు హిందువుగా మతం మారినట్లు ప్రచారం చేసుకున్న జగన్.. ఇపుడు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ

Last Updated : Jan 6, 2021, 10:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.