మూడు రాజధానులతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని గుంటూరు జిల్లా వేమూరు శాసనసభ్యులు మేరుగ నాగార్జున చెప్పారు. గుంటూరు వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ కార్యకర్తల సమావేశంలో మూడు రాజధానులకు మద్దతుగా తీర్మానం చేశామని తెలిపారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాజధానిలో ధర్నా చేసేవారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రక్రియను అడ్డుకునేయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
కర్నూలుకు నీళ్లు ఇవ్వాలని కోరితే హై కోర్టును ఇస్తారా?: బైరెడ్డి