ETV Bharat / state

16 లక్షలు విలువ చేసే గోవా మద్యం పట్టివేత.. - vinukonda latest news

గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటిగలపాలెం వద్ద గోవా మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు నిఘా ఉంచి.. పట్టుకున్నామని తెలిపారు.

Illegal liquor seized
అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Feb 22, 2021, 12:56 PM IST

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటి గల పాలెం వద్ద ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.16 లక్షలు విలువచేసే మద్యం సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. గోవా నుంచి లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిఘా ఉంచి పట్టుకున్నామని చెప్పారు. మద్యం సరఫరా చేస్తున్నవారిలో కొందరు పారిపోగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటి గల పాలెం వద్ద ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.16 లక్షలు విలువచేసే మద్యం సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. గోవా నుంచి లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిఘా ఉంచి పట్టుకున్నామని చెప్పారు. మద్యం సరఫరా చేస్తున్నవారిలో కొందరు పారిపోగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: స్వల్ప ఆధిక్యంతో విజయాలు.. రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.