ETV Bharat / state

ఇంటర్ బోర్డు ఉద్యోగికి కరోనా.. 19 వరకు కార్యాలయం బంద్

author img

By

Published : Jul 14, 2020, 8:30 PM IST

ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా తాకిడి ఆందోళనకు గురి చేస్తోంది. గుంటూరు జిల్లాలో వైరస్​ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తుండగా ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 19 వరకు కార్యాలయాన్ని మూసివేస్తూ కమిషనర్ కార్యాలయం​ ఆదేశాలు జారీ చేసింది.

Corona positive to inter board employee
ఇంటర్ బోర్డు ఉద్యోగికి కరోనా

గుంటూరులో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా తాకిడి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడగా ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

ఈ కారణంగా.. బోర్డు కార్యాలయాన్ని ఈనెల 19 వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. పారిశుద్ధ్య చర్యల అనంతరం 20న ఇంటర్​ బోర్డు తెరుస్తామని కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఉద్యోగుల రక్షణ కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

గుంటూరులో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా తాకిడి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడగా ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

ఈ కారణంగా.. బోర్డు కార్యాలయాన్ని ఈనెల 19 వరకు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. పారిశుద్ధ్య చర్యల అనంతరం 20న ఇంటర్​ బోర్డు తెరుస్తామని కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఉద్యోగుల రక్షణ కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:

వీధి బాలలను కాపాడేందుకు ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్-19: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.