ETV Bharat / state

800కు చేరువలో కరోనా కేసులు... పోస్ట్ మెన్​కు పాజిటివ్

author img

By

Published : Jun 18, 2020, 7:06 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా 31 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం జిల్లాలో కరోనా బారినపడినవారి సంఖ్య 762కు చేరింది. అయితే పత్తిపాడు మండలం తిక్కారెడ్డిపాలెంలో ఓ పోస్ట్ మెన్​కు పాజిటివ్ రావటం.. నిన్నటి వరకూ అతను విధులకు హాజరుకావటం అటు ప్రజలకు ఇటు అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.

corona cases in guntur dst increasing postmen tested positive in prathipadu mandal
corona cases in guntur dst increasing postmen tested positive in prathipadu mandal

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ రోజు మరో 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో కోవిడ్ కేసులు 762కు చేరుకున్నాయి. కొత్త కేసులు తాడేపల్లిలో 8 , గుంటూరులో 7, తెనాలిలో 5, బాపట్లలో 3, వినుకొండలో 2, మంగళగిరిలో 2, దుగ్గిరాలలో 2, రొంపిచెర్ల మండలం కొత్తపల్లిలో 1, ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డి పాలెంలో 1 కేసు నమోదయ్యాయి.

గతంలో గ్రీన్ జోన్లుగా ఉన్న వినుకొండలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఆ ప్రాంతంలో కేసులే లేవు. ఇక ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డిపాలెంలో ఓ పోస్ట్ మెన్ కు పాజిటివ్​గా నిర్దరణ అయింది. మూడు రోజుల నుంచి అతను విధుల్లోనే ఉండటం, ఉత్తరాలు బడ్వాటా చేయటం స్థానికులను, అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ఇపుడు అదికారుల ఆ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి : దర్శి పోలీస్ స్టేషన్​లో ఎస్​ఐ నుంచి రైటర్​కు

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ రోజు మరో 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో కోవిడ్ కేసులు 762కు చేరుకున్నాయి. కొత్త కేసులు తాడేపల్లిలో 8 , గుంటూరులో 7, తెనాలిలో 5, బాపట్లలో 3, వినుకొండలో 2, మంగళగిరిలో 2, దుగ్గిరాలలో 2, రొంపిచెర్ల మండలం కొత్తపల్లిలో 1, ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డి పాలెంలో 1 కేసు నమోదయ్యాయి.

గతంలో గ్రీన్ జోన్లుగా ఉన్న వినుకొండలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఆ ప్రాంతంలో కేసులే లేవు. ఇక ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డిపాలెంలో ఓ పోస్ట్ మెన్ కు పాజిటివ్​గా నిర్దరణ అయింది. మూడు రోజుల నుంచి అతను విధుల్లోనే ఉండటం, ఉత్తరాలు బడ్వాటా చేయటం స్థానికులను, అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ఇపుడు అదికారుల ఆ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి : దర్శి పోలీస్ స్టేషన్​లో ఎస్​ఐ నుంచి రైటర్​కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.