ETV Bharat / state

గుంటూరు కలెక్టరేట్​ వద్ద జనసేన నేతల ఆందోళన - జనసేన నాయకులు తాజా వార్తలు

నివర్​ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్​ వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రదర్శన చేపట్టారు.

janasena leaders protest at guntur
గుంటూరు జిల్లా కలెక్టరేట్​ వద్ద జనసేన నేతల ఆందోళన
author img

By

Published : Dec 28, 2020, 4:04 PM IST

గుంటూరు జిల్లా కలెక్టరేట్​ వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. నివర్ తుపాన్​తో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ.పది వేలు అందించాలని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్​ చేశారు. తక్కువ ధరకు కొన్న భూముల్ని ఎక్కువ ధరకు సర్కారుకు అమ్ముకుని.. పేదలకు పట్టాలు ఇచ్చామని చెబుతున్నారన్నారు. మరి రైతులను ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. డీఆర్వో చంద్రశేఖర్​ రెడ్డికి వినతి పత్రం అందించారు.

గుంటూరు జిల్లా కలెక్టరేట్​ వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. నివర్ తుపాన్​తో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ.పది వేలు అందించాలని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్​ చేశారు. తక్కువ ధరకు కొన్న భూముల్ని ఎక్కువ ధరకు సర్కారుకు అమ్ముకుని.. పేదలకు పట్టాలు ఇచ్చామని చెబుతున్నారన్నారు. మరి రైతులను ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. డీఆర్వో చంద్రశేఖర్​ రెడ్డికి వినతి పత్రం అందించారు.

ఇదీ చదవండి: నూతన పన్నులను ఉపసంహరించుకోవాలని నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.