ETV Bharat / state

రైతుపై దాడి.. ఎస్పీకి ఫిర్యాదు.. బీసీ సంఘాల మద్దతు - గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన కొల్లిపర రైతు

గుంటూరు జిల్లాలో రైతు కూలీపై దాడి వ్యవహారం ఎస్పీ కార్యాలయానికి చేరింది. బాధితుడు సాంబశివరావు ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు... కేసు పెట్టడంలో జాప్యం చేసిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

bc unions meet guntur sp
గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన వైకాపా బాధిత రైతు
author img

By

Published : Aug 26, 2020, 3:49 PM IST

గుంటూరు జిల్లాలో రైతు కూలీపై దాడి వ్యవహారం ఎస్పీ కార్యాలయానికి చేరింది. బాధితుడు సాంబశివరావు ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కొల్లిపొర మండలం మున్నంగికి చెందిన శొంఠి సాంబశివరావు గౌడ్​పై.. అదే గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి, సందీప్ రెడ్డి ఈనెల 23వ తేదీన దాడి చేశారు. ఆ తర్వాత స్థానిక వైకాపా నేత వేణుగోపాలరెడ్డి బెదిరించారని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్​కు వెళ్తే... కేసు లేకుండా రాజీ చేసుకోవాలని కొల్లిపొర ఎస్.ఐ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.

అందుకే తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరేందుకు వచ్చినట్లు సాంబశివరావు తెలిపారు. సాంబశివరావుకు బీసీ సంఘాల నేతలు మద్దతు పలికారు. అయితే వారు వచ్చిన సమయంలో ఎస్పీ అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అగ్రకుల దురహంకారానికి ఈ ఘటన నిదర్శనమని బీసీ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారితో పాటు... కేసు పెట్టడంలో జాప్యం చేసిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లాలో రైతు కూలీపై దాడి వ్యవహారం ఎస్పీ కార్యాలయానికి చేరింది. బాధితుడు సాంబశివరావు ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కొల్లిపొర మండలం మున్నంగికి చెందిన శొంఠి సాంబశివరావు గౌడ్​పై.. అదే గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి, సందీప్ రెడ్డి ఈనెల 23వ తేదీన దాడి చేశారు. ఆ తర్వాత స్థానిక వైకాపా నేత వేణుగోపాలరెడ్డి బెదిరించారని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్​కు వెళ్తే... కేసు లేకుండా రాజీ చేసుకోవాలని కొల్లిపొర ఎస్.ఐ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.

అందుకే తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరేందుకు వచ్చినట్లు సాంబశివరావు తెలిపారు. సాంబశివరావుకు బీసీ సంఘాల నేతలు మద్దతు పలికారు. అయితే వారు వచ్చిన సమయంలో ఎస్పీ అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అగ్రకుల దురహంకారానికి ఈ ఘటన నిదర్శనమని బీసీ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారితో పాటు... కేసు పెట్టడంలో జాప్యం చేసిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

వీడియో వైరల్: కులం పేరుతో దూషించిన వైకాపా నేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.