ETV Bharat / state

సాధువు గారి సైకిల్ సవారీ..త్వరలో గమ్యానికి చేరిక

author img

By

Published : May 23, 2020, 10:39 PM IST

లాక్​డౌన్ కారణంగా ఎక్కడెక్కడో చిక్కుకుపోయినవారు ఎలా అయినా తమ సొంతూళ్లకు చేరుకోవాలని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో చిక్కుకుపోయిన ఓ సాధువు సైకిల్​పై తూర్పుగోదావరి జిల్లా తునికి బయలుదేరారు...ఆరు రోజులు ప్రయాణించి ఈ రోజు గుంటూరు చేరుకున్నారు.

a Saint started jounrney from cadapa dst to east godavari through cycle
a Saint started jounrney from cadapa dst to east godavari through cycle

లాక్​డౌన్ ఓ సాధువుని సైకిల్ ఎక్కించింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన పశుపతి అనే సాధువు తీర్థయాత్రల్లో భాగంగా మార్చి 21న కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వెళ్లారు. అయితే లాక్​డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. రెండు నెలల పాటు అక్కడే ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు... చివరకు ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని అక్కడి వారి సాయంతో ఓ సైకిల్ సమకూర్చుకున్నాడు. సైకిల్ తొక్కుకుంటూ తునికి బయలుదేరారు. ఆరు రోజుల క్రితం బ్రహ్మం గారి మఠంలో ప్రయాణం ప్రారంభించి.. శనివారానికి గుంటూరు చేరుకున్నారు. మార్గమధ్యంలో దాతలు ఇచ్చే ఆహారంతో కడుపు నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో సొంతూరికి చేరుకుంటానని ఆయన తెలిపారు.

లాక్​డౌన్ ఓ సాధువుని సైకిల్ ఎక్కించింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన పశుపతి అనే సాధువు తీర్థయాత్రల్లో భాగంగా మార్చి 21న కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వెళ్లారు. అయితే లాక్​డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. రెండు నెలల పాటు అక్కడే ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు... చివరకు ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని అక్కడి వారి సాయంతో ఓ సైకిల్ సమకూర్చుకున్నాడు. సైకిల్ తొక్కుకుంటూ తునికి బయలుదేరారు. ఆరు రోజుల క్రితం బ్రహ్మం గారి మఠంలో ప్రయాణం ప్రారంభించి.. శనివారానికి గుంటూరు చేరుకున్నారు. మార్గమధ్యంలో దాతలు ఇచ్చే ఆహారంతో కడుపు నింపుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో నాలుగైదు రోజుల్లో సొంతూరికి చేరుకుంటానని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి విజయనగర రాజుల కాలం నాటి కట్టడం కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.