ఎస్సీ, ఎస్టీ మోనార్టీల ఓటు బ్యాంకును అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిపైనే దాడులకు తెగబడుతున్నారని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఇసుక లారీని అడ్డుకున్నందుకు ఓ యువకుడికి వైకాపా నాయకులు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ యువతిపై అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి నోరు మెదపలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
'ఎస్సీలపై దాడులను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి'
ఎస్సీలపై దాడులను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఎవరైనా వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['ఎస్సీలపై దాడులను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి' sunkara padhma sri on attacks on daliths in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8186084-504-8186084-1595823002095.jpg?imwidth=3840)
ఎస్సీ, ఎస్టీ మోనార్టీల ఓటు బ్యాంకును అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిపైనే దాడులకు తెగబడుతున్నారని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఇసుక లారీని అడ్డుకున్నందుకు ఓ యువకుడికి వైకాపా నాయకులు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ యువతిపై అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి నోరు మెదపలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఆ రైతింట 'సోనూ'లిక ట్రాక్టర్