తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కమ్మిరెడ్డిపాలెంలోని నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 10 లీటర్ల నాటుసారా, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే గ్యాస్ స్టౌవ్, బెల్లం, అమ్మోనియా, ఇతర సామన్లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి