తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హెచ్.అమరరంగేశ్వరరావు కోర్టులో మంగళవారం ఆన్లైన్లో తీర్పులు చెప్పి, నిందుతులకు శిక్ష విధించారు. కరోనా కారణంగా కొద్దిరోజులుగా కింది కోర్టులు పనిచేయటంలేదు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఆన్లైన్లోనే తీర్పులిచ్చారు. బంగారం చోరి కేసులు , మోటారు సైకిళ్ల చోరీ కేసుల్లో నలుగురు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 2019లో నమోదైన కేసులో వై.సాయికుమార్, పిండి సతీష్లకు ఆరు నెలలు, 2020 సంవత్సరానికి సంబంధించిన కేసులలో మందెల సూర్య భాస్కరరావుకు ఏడు నెలలు, యల్లమిల్లి వెంకట్రావుకు ఐదు నెలల జైలు శిక్ష విధించారు.
ఇదీ చదవండి : వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి నేడే శ్రీకారం