ETV Bharat / state

MLC THOTA: పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం.. - పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం వార్తలు

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెేనికి వచ్చిన తోట త్రిమూర్తులుకు భారీ గజమాల వేసేందుకు అభిమానులు.. రోడ్డుపైకి క్రేన్ తీసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం తలెత్తింది. విషయం తెలుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

mlc thota trimurthulu fires on police
పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం
author img

By

Published : Jun 22, 2021, 2:26 PM IST

Updated : Jun 22, 2021, 4:13 PM IST

పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి.. స్వస్థలానికి వస్తున్న తోట త్రిమూర్తలుకు స్వాగతం పలికే క్రమంలో ఆయన అభిమానులు, పోలీసులకు మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో త్రిమూర్తులుకు భారీ గజమాల వేసేందుకు అభిమానులు.. రోడ్డుపైకి క్రేన్ తీసుకువచ్చారు. కొవిడ్ నిబంధనలకు తోడు.. క్రేన్ వల్ల ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతుందని పోలీసులు అడ్డుకున్నారు. క్రేన్ డ్రైవర్​ను పోలీసులు కిందకు దింపటంతో.. సర్పంచ్ వెంకట్​రెడ్డి డ్రైవర్ స్థానంలోకి వెళ్లి కూర్చున్నారు. ఈ క్రమంలో స్వల్వ వాగ్వాదం జరిగింది. విషయం తెలుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ఘనస్వాగతం

mlc thota trimurthulu
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను గజమాలతో సత్కరించిన అభిమానులు

అనంతరం.. గోపాలపురం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును అభిమానులు ర్యాలీగా తీసుకొని వచ్చారు. రావులపాలెం సెంటర్​లో వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులు పూల కిరీటం అలంకరించి గజమాలతో సత్కరించారు. అనంతరం గౌతమీ వంతెన మీదుగా ఆలమూరు మండలం చేరుకొని అక్కడ అభిమానులతో కలిసి మండపేట చేరుకున్నారు.

ఇదీ చదవండి: YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్​ చేయూత: సీఎం జగన్​

పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి.. స్వస్థలానికి వస్తున్న తోట త్రిమూర్తలుకు స్వాగతం పలికే క్రమంలో ఆయన అభిమానులు, పోలీసులకు మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో త్రిమూర్తులుకు భారీ గజమాల వేసేందుకు అభిమానులు.. రోడ్డుపైకి క్రేన్ తీసుకువచ్చారు. కొవిడ్ నిబంధనలకు తోడు.. క్రేన్ వల్ల ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతుందని పోలీసులు అడ్డుకున్నారు. క్రేన్ డ్రైవర్​ను పోలీసులు కిందకు దింపటంతో.. సర్పంచ్ వెంకట్​రెడ్డి డ్రైవర్ స్థానంలోకి వెళ్లి కూర్చున్నారు. ఈ క్రమంలో స్వల్వ వాగ్వాదం జరిగింది. విషయం తెలుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ఘనస్వాగతం

mlc thota trimurthulu
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను గజమాలతో సత్కరించిన అభిమానులు

అనంతరం.. గోపాలపురం వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును అభిమానులు ర్యాలీగా తీసుకొని వచ్చారు. రావులపాలెం సెంటర్​లో వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులు పూల కిరీటం అలంకరించి గజమాలతో సత్కరించారు. అనంతరం గౌతమీ వంతెన మీదుగా ఆలమూరు మండలం చేరుకొని అక్కడ అభిమానులతో కలిసి మండపేట చేరుకున్నారు.

ఇదీ చదవండి: YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్​ చేయూత: సీఎం జగన్​

Last Updated : Jun 22, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.