ETV Bharat / state

తునిలో లాక్​డౌన్ మరింత కఠినం

author img

By

Published : Apr 10, 2020, 10:10 AM IST

తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. తుని - పాయకరావుపేట రహదారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దంటూ సూచనలు చేస్తున్నారు.

lock down in tuni at east godavari district
తునిలో కఠినంగా లాక్​డౌన్ అమలు

తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్ డౌన్​ను అధికారులు మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన వ్యక్తికి కరోనా సోకిన పరిస్థితుల్లో.. తుని అధికారులు అప్రమత్తమయ్యారు. తుని - పాయకరావుపేటకు మధ్య రాకపోకలు నిలిపివేశారు. బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఉప్పరిగూడెం ప్రాంతవాసులు తమ గ్రామంలోకి ఎవ్వరూ రాకుండా కంచె ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్ డౌన్​ను అధికారులు మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన వ్యక్తికి కరోనా సోకిన పరిస్థితుల్లో.. తుని అధికారులు అప్రమత్తమయ్యారు. తుని - పాయకరావుపేటకు మధ్య రాకపోకలు నిలిపివేశారు. బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఉప్పరిగూడెం ప్రాంతవాసులు తమ గ్రామంలోకి ఎవ్వరూ రాకుండా కంచె ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

'పంటను కొంటాం... రైతును ఆదుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.