ETV Bharat / state

బావిలో మృతదేహం.. చనిపోయాడా... చంపేశారా? - చెన్నంపల్లిలో బావిలో పడి యువకుడు మృతి

ఈతకని పొద్దున అనగా వెళ్లాడు. వస్తాడులే ఊళ్లోనే కదా అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. పొద్దుపోయింది. చిమ్మచీకటైనా ఇల్లు చేరలేదు. తమ గారాల కుమారుడు ఏమైపోయాడో అని వెతికిన వారికి.. చివరికి విషాదమే మిగిలింది. బావిలో శవమై తేలిన కుమారుడిని చూసి.. వారి గుండె పగిలింది.

a man died in well due to swimming at Cennampalli in east godavari
a man died in well due to swimming at Cennampalli in east godavari
author img

By

Published : Apr 7, 2020, 3:53 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సాయి అనే 15 ఏళ్ల యువకుడు సోమవారం ఈతకు వెళ్ళాడు. కుమారుడు రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి.. తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. ఊరి సమీపంలో బావిలో శవంగా తేలుతున్న కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బావిలో మృతదేహం కనిపించిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఈత రాకనే చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సాయి అనే 15 ఏళ్ల యువకుడు సోమవారం ఈతకు వెళ్ళాడు. కుమారుడు రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి.. తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. ఊరి సమీపంలో బావిలో శవంగా తేలుతున్న కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బావిలో మృతదేహం కనిపించిన తీరుపై ఆరా తీస్తున్నారు. ఈత రాకనే చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కంచె వెనుక కథ.. బలైన ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.