నాణ్యత, పర్యావరణహిత వ్యవస్థల ఉత్తమ నిర్వహణకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) నుంచి శ్రీసిటీ ధ్రువీకరణ పత్రాలను పొందింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) అనేది సాంకేతికత,ఉత్పత్తుల రెండింటికీ ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో వివిధ ప్రమాణాల సంస్థలతో కలిసి పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ. నాణ్యతా నిర్వహణకు ఐఎస్ఓ 9001:2015, పర్యావరణ హిత వ్యవస్థల నిర్వహణకు ఐఎస్ఓ 14001:2015 పత్రాలను సంస్థ నిర్వాహకులు శుక్రవారం అందజేశారు. ఈ పత్రాలు 3 సంవత్సరాలు చెల్లుతాయి.
జాతీయ స్థాయిలో తమ ప్రమాణాలు, నైపుణ్యతకు గుర్తింపుగా శ్రీసిటీ ఇప్పటికే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రతిష్టాత్మక గ్రీన్ సిటీ 'గోల్డ్' రేటింగ్ , అసోచామ్ గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ మూవ్మెంట్ (జీఈఎం) సస్టైనబిలిటీ సర్టిఫికేషన్లను వరుసగా 2017, 2018 సంవత్సరాలలో దక్కించుకుంది.