17వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు 'నిడ్జమ్-2019' తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి సంబంధించిన తారకరామ మైదానం ఈ పోటీలకు వేదికయ్యింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, నారాయణస్వామి, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా పోటీలను ప్రారంభించారు. క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 5వేల మంది అథ్లెట్స్ తరలివచ్చారు. 14 ఏళ్లలోపు విభాగంలో 5 క్రీడాంశాలు, 16 ఏళ్ల లోపు విభాగంలో 12 క్రీడాంశాల్లో అథ్లెట్స్ సత్తా చాటనున్నారు. పరుగు పందెం, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 3 రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని మంత్రులు అన్నారు.
ఇవి కూడా చదవండి: