ETV Bharat / state

'శ్రీకాళహస్తి విగ్రహాల వ్యవహారంలో ఈవోను తప్పించి విచారణ చేయాలి'

author img

By

Published : Sep 15, 2020, 3:11 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ప్రతిష్ఠించిన వ్యవహారంపై భాజాపా, జనసేన నాయకులు అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈవోను తప్పించి విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు.

శ్రీకాళహస్తి విగ్రహాల వ్యవహారంలో ఈవోను తప్పించి విచారణ చేయాలి
శ్రీకాళహస్తి విగ్రహాల వ్యవహారంలో ఈవోను తప్పించి విచారణ చేయాలి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికార విగ్రహాల ప్రతిష్ఠాపన వ్యవహారంలో ఈవోను తప్పించి విచారణ జరిపించాలని భాజాపా, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు... ఎస్పీ రమేశ్ రెడ్డిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు లేఖను అందజేశారు. ఆలయ అధికారులకు తెలియకుండా విగ్రహాలు లోనికి వెళ్లటం సాధ్యం కాదన్న భాజపా, జనసేన నాయకులు.. జరిగిన వ్యవహారం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని వ్యాఖ్యనించారు.

బుధవారం ఇరుపార్టీల బృందం ఆలయాన్ని సందర్శించి జరిగిన వ్యవహారంపై నివేదికను తయారు చేస్తామన్నారు. ఇన్నాళ్లు ఆలయాలపై దాడులు జరిగితే...ఇప్పుడు ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని దీనిని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా పరిగణిస్తున్నామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికార విగ్రహాల ప్రతిష్ఠాపన వ్యవహారంలో ఈవోను తప్పించి విచారణ జరిపించాలని భాజాపా, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు... ఎస్పీ రమేశ్ రెడ్డిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు లేఖను అందజేశారు. ఆలయ అధికారులకు తెలియకుండా విగ్రహాలు లోనికి వెళ్లటం సాధ్యం కాదన్న భాజపా, జనసేన నాయకులు.. జరిగిన వ్యవహారం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని వ్యాఖ్యనించారు.

బుధవారం ఇరుపార్టీల బృందం ఆలయాన్ని సందర్శించి జరిగిన వ్యవహారంపై నివేదికను తయారు చేస్తామన్నారు. ఇన్నాళ్లు ఆలయాలపై దాడులు జరిగితే...ఇప్పుడు ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని దీనిని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా పరిగణిస్తున్నామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.

ఇదీచదవండి

'బయటి నుంచి విగ్రహాలు లోపలికి ఎలా వెళ్లాయి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.