ETV Bharat / state

మాజీ మేయర్ భర్త, తెదేపా కన్వీనర్ కఠారి ప్రవీణ్ కరోనాతో మృతి

author img

By

Published : Apr 26, 2021, 12:28 PM IST

కరోనాతో చిత్తూరు నగర మాజీ మేయర్ హేమలత భర్త, తెదేపా కన్వీనర్ కఠారి ప్రవీణ్ మృతి చెందారు. గత వారం రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు తెదేపా నేతలు సంతాపం తెలిపారు.

TDP convener Katari Praveen died with Corona
తెదేపా కన్వీనర్ కఠారి ప్రవీణ్ కరోనాతో మృతి

చిత్తూరు నగర మాజీ మేయర్ హేమలత భర్త, తెదేపా కన్వీనర్ కఠారి ప్రవీణ్ (39) కరోనాతో మృతి చెందారు. గత వారం రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున మృతి చెందారు. ప్రవీణ్ తల్లి కఠారి అనురాధ సైతం నగర మేయర్​గా విధులు నిర్వహించారు. ఆయన తండ్రి కఠారి మోహన్ తెదేపా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

2016లో చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ప్రవీణ్ తల్లిదండ్రులు దారుణ హత్యకు గురయ్యారు. కఠారి ప్రవీణ్ మృతికి తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ సంతాపం ప్రకటించారు.

ఇవీ చూడండి...

కటారి ప్రవీణ్ మరణం కలచివేసింది: చంద్రబాబు

చిత్తూరు నగర మాజీ మేయర్ హేమలత భర్త, తెదేపా కన్వీనర్ కఠారి ప్రవీణ్ (39) కరోనాతో మృతి చెందారు. గత వారం రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున మృతి చెందారు. ప్రవీణ్ తల్లి కఠారి అనురాధ సైతం నగర మేయర్​గా విధులు నిర్వహించారు. ఆయన తండ్రి కఠారి మోహన్ తెదేపా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

2016లో చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ప్రవీణ్ తల్లిదండ్రులు దారుణ హత్యకు గురయ్యారు. కఠారి ప్రవీణ్ మృతికి తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ సంతాపం ప్రకటించారు.

ఇవీ చూడండి...

కటారి ప్రవీణ్ మరణం కలచివేసింది: చంద్రబాబు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.