ETV Bharat / state

అత్యధిక 'కోవిడ్​ మరణాలు' జిల్లాలోనే.. ఇప్పటి వరకు 504 మంది మృతి

author img

By

Published : Sep 10, 2020, 7:35 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకూ కరోనాతో జిల్లాలో 504 మంది మరణించారు. రాష్ట్రంలో అత్యధిక మరణాలు నమోదైన జిల్లాగా... చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. తాజాగా.. కోవిడ్​తో 9 మంది చనిపోగా.. 968 మంది వైరస్ బారిన పడ్డారు.

corona cases
corona cases

చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు 500 మార్క్ దాటేశాయి. ఒకే జిల్లాలో ఈ స్థాయిలో మరణాలు నమోదవటం రాష్ట్ర స్థాయిలోనే అత్యధికం. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది.. ఇతర అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకున్నవారూ ఉన్నారు. కేసుల విషయం చూస్తే.. జిల్లాలో కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది.

ఒక రోజులోనే 968 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 46,469కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 504కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు చిత్తూరు జిల్లాలోనే నమోదవటం మహమ్మారి విజృంభణను స్పష్టం చేస్తోంది. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 37,218 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మరో 8,747 మంది చికిత్స పొందుతున్నారు.

చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు 500 మార్క్ దాటేశాయి. ఒకే జిల్లాలో ఈ స్థాయిలో మరణాలు నమోదవటం రాష్ట్ర స్థాయిలోనే అత్యధికం. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది.. ఇతర అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకున్నవారూ ఉన్నారు. కేసుల విషయం చూస్తే.. జిల్లాలో కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది.

ఒక రోజులోనే 968 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 46,469కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 504కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు చిత్తూరు జిల్లాలోనే నమోదవటం మహమ్మారి విజృంభణను స్పష్టం చేస్తోంది. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 37,218 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మరో 8,747 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

మరోసారి 10 వేలకు పైనే కేసులు... 5,37,687కి చేరిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.