ETV Bharat / state

కొత్తగా 4 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు

author img

By

Published : Feb 12, 2019, 9:41 PM IST

రాష్ట్రంలో నూతనంగా 4 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం (సుడా), బొబ్బిలి (బుడా), పలమనేరు-కుప్పం-మదనపల్లి (పీకేఎం-ఉడా), చిత్తూరు (చుడా) పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది.

కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఉత్తర్వులు

రాష్ట్రంలో కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు - కుప్పం - మదనపల్లి పట్టణాలను కలుపుతూ పీకేఎం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలెవన్ ఆదేశాలిచ్చారు. ప్రత్యేకంగా చిత్తూరు పట్ణణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన పీకేఎం-ఉడా పరిధిలో 12 మండలాలు, 376 గ్రామాలను చేర్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్​తో పాటు 22 మండలాలు, 434 గ్రామాలను చిత్తూరు అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఉత్తర్వులు

శ్రీకాకుళం అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పరిధిలోకి... 968 గ్రామాలతో పాటు ఇచ్చాపురం, పాలకొండ, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలను చేర్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ (బుడా) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 572 గ్రామాలు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలను బుడా పరిధిలోకి తీసుకొచ్చారు.

రాష్ట్రంలో కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు - కుప్పం - మదనపల్లి పట్టణాలను కలుపుతూ పీకేఎం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలెవన్ ఆదేశాలిచ్చారు. ప్రత్యేకంగా చిత్తూరు పట్ణణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన పీకేఎం-ఉడా పరిధిలో 12 మండలాలు, 376 గ్రామాలను చేర్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్​తో పాటు 22 మండలాలు, 434 గ్రామాలను చిత్తూరు అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఉత్తర్వులు

శ్రీకాకుళం అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ పరిధిలోకి... 968 గ్రామాలతో పాటు ఇచ్చాపురం, పాలకొండ, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలను చేర్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ (బుడా) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 572 గ్రామాలు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలను బుడా పరిధిలోకి తీసుకొచ్చారు.

Lucknow (UP), Feb 11(ANI): In a roadshow at Lucknow Rahul Gandhi said, "Nation's 'chowkidaar' (Watchman) stole money from Uttar Pradesh, other states and Air Force. 'Chowkidaar chor hai'. UP is the heart of the country. We'll play on front-foot. I told Scindia Ji and Priyanka Ji to fight against injustice happened in Uttar Pradesh all these years. I won't rest until and unless government of Congress' ideology is formed here".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.