రాష్ట్రంలో కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు - కుప్పం - మదనపల్లి పట్టణాలను కలుపుతూ పీకేఎం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలెవన్ ఆదేశాలిచ్చారు. ప్రత్యేకంగా చిత్తూరు పట్ణణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన పీకేఎం-ఉడా పరిధిలో 12 మండలాలు, 376 గ్రామాలను చేర్చారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 22 మండలాలు, 434 గ్రామాలను చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
![](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)