ETV Bharat / state

అనంతపురంలో మహిళ దారుణ హత్య..దొంగల పనేనా..!

అనంతపురంలోని టీవీ టవర్ సమీపంలో లక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jul 28, 2020, 5:36 PM IST

అనంతపురంలో మహిళ దారుణ హత్య
అనంతపురంలో మహిళ దారుణ హత్య

అనంతపురంలోని నగర శివారు టీవీ టవర్ సమీపంలో లక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. బుడ్డప్పనగర్ కు చెందిన లక్ష్మీదేవి టీవీ టవర్ సమీపంలో తన కొడుకు కొత్త ఇంటిని నిర్మాణం చేపడుతుండగా.. రాత్రి సమయంలో ఆమె కాపలాగా ఉండేది. అయితే సోమవారం అర్ధరాత్రి పక్కింట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగలను ఆమె చూడటంతో.. దొంగలు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, చోరీ జరిగిన ఇంటిని డాగ్ స్క్వాడ్ తో పోలీసులు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

అనంతపురంలోని నగర శివారు టీవీ టవర్ సమీపంలో లక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. బుడ్డప్పనగర్ కు చెందిన లక్ష్మీదేవి టీవీ టవర్ సమీపంలో తన కొడుకు కొత్త ఇంటిని నిర్మాణం చేపడుతుండగా.. రాత్రి సమయంలో ఆమె కాపలాగా ఉండేది. అయితే సోమవారం అర్ధరాత్రి పక్కింట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగలను ఆమె చూడటంతో.. దొంగలు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, చోరీ జరిగిన ఇంటిని డాగ్ స్క్వాడ్ తో పోలీసులు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్ పడకలు పెంచేందుకు సర్కార్ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.