ETV Bharat / state

'నా చావుకు ఎవరూ బాధ్యులు కారు': మరో సెల్ఫీ వీడియో వైరల్

author img

By

Published : Nov 24, 2020, 9:53 AM IST

అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు చనిపోతున్నానంటూ....సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

young man missing in ananthapuram
నార్పల మండలంలో యువకుడి ఆదృశ్యం

నార్పల మండలంలో యువకుడి ఆదృశ్యం

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటకు చెందిన రాజేష్(18) అనే యువకుడు పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్లాలనుకుంటున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకండి.' అంటూ రాజేష్ పెట్టిన వీడియో కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియో చూసిన అతడి తల్లిదండ్రులు.. తమ కుమారుడు ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నార్పల మండలంలో యువకుడి ఆదృశ్యం

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటకు చెందిన రాజేష్(18) అనే యువకుడు పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్లాలనుకుంటున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకండి.' అంటూ రాజేష్ పెట్టిన వీడియో కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియో చూసిన అతడి తల్లిదండ్రులు.. తమ కుమారుడు ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కెనడాలో అనంత యువకుడి ఆత్మహత్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.