ETV Bharat / state

'వైకాపా​ ప్రభుత్వ ఆగడాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం'

author img

By

Published : Jun 12, 2020, 3:38 PM IST

తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తంచేశారు.

తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గంలో నిరసన
తెదేపా నేత అచ్చెన్నాయుడు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ కళ్యాణదుర్గంలో నిరసన

ప్రస్తుతం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి వాస్తవిక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన పేర్కొన్నారు. తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్ట్​కు నిరసనగా కళ్యాణదుర్గం తెదేపా కార్యాలయం నుంచి నల్ల జెండాలతో స్థానిక అంబేడ్కర్​ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ ఆగడాలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని కళ్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి వాస్తవిక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన పేర్కొన్నారు. తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్ట్​కు నిరసనగా కళ్యాణదుర్గం తెదేపా కార్యాలయం నుంచి నల్ల జెండాలతో స్థానిక అంబేడ్కర్​ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ ఆగడాలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'అన్యాయాలు, అరాచకాలు బయటపెడుతున్నందుకే అరెస్టులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.