ETV Bharat / state

ఆరో రోజు వైభవంగా నవరాత్రి ఉత్సవాలు - నవరాత్రి ఆరవ రోజున అనంతపురం దేవాలయాలు

దసరా శరన్నవత్రుల్లో ఆరో రోజున.. అనంతపురం జిల్లాలోని వివిధ దేవాలయాలు భక్తులతో కోలాహలంగా కనిపించాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో అమ్మవారిని సేవించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. అమ్మవారిని దర్శించుకున్నారు.

navaratri 6thday in anantapuram
అనంతపురంలో నవరాత్రి ఆరవ రోజు
author img

By

Published : Oct 23, 2020, 8:29 AM IST

నవరాత్రుల సందర్భంగా.. అనంతపురం జిల్లా కదిరిలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకారంలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిచ్చారు. కుమ్మరవాండ్ల పల్లిలోని మల్లాలమ్మ గుడిలో అన్నపూర్ణదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ధర్మవరంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు.. సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. మహాలక్ష్మి అలంకారంలో గాంధీనగర్ చౌడేశ్వరి అమ్మవారు ఆకట్టుకున్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ.. భౌతిక దూరం పాటించే విధంగా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు గుంపులు కూడకుండా చర్యలు తీసుకున్నారు.

నవరాత్రుల సందర్భంగా.. అనంతపురం జిల్లా కదిరిలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకారంలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిచ్చారు. కుమ్మరవాండ్ల పల్లిలోని మల్లాలమ్మ గుడిలో అన్నపూర్ణదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ధర్మవరంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు.. సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. మహాలక్ష్మి అలంకారంలో గాంధీనగర్ చౌడేశ్వరి అమ్మవారు ఆకట్టుకున్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ.. భౌతిక దూరం పాటించే విధంగా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు గుంపులు కూడకుండా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలి: సిద్దారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.