అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు సమావేశమయ్యారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల 4 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
ఇదీ చూడండి: