అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం జయనగర్ కాలనీలో ఓ వ్యక్తి కారు నడపడం నేర్చుకుంటున్న సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. కారును వెనక్కి నడిపే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని, స్కూటీని ఢీకొట్టింది. చివరికి కారు బండలమీదికి వెళ్లి ఆగింది. ఈ ఘటన సమయంలో కాలనీలో ఎవరూ లేకపోవడం.. ప్రమాదాన్ని తప్పించింది. కారులోని వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కారణంగా.. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగగా.. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.
ఇదీ చూడండి