ETV Bharat / jagte-raho

బీ అలర్ట్​: కస్టమర్​ కేర్​ అంటారు... ఖాతాలు ఖాళీ చేస్తారు!

author img

By

Published : Sep 20, 2020, 11:39 PM IST

భాగ్యనగరంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్నే పెట్టుబడిగా లక్షలు దోచేస్తున్నారు. గూగుల్​పే కస్టమర్​ కేర్​ నుంచి మాట్లాడుతున్నామని ఒకరు... కేవైసీ అప్​డేట్​ చేసుకోవాలని ఇంకొకరు... బ్యాంకు నుంచి రుణమిస్తామని మరొకరు ఇలా ఫోన్​లు చేసి కుచ్చుటోపీలు పెడుతున్నారు.

online-cheating-cases  increased-in-hyderabad
online-cheating-cases increased-in-hyderabad

ఆన్​లైన్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. సైబర్​ మోసగాళ్ల వలకు చిక్కి అమాయకులు లక్షలు పొగొట్టుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రోజుకు కనీసం 30 నుంచి 50 లక్షల రూపాయలు వరకు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు.

కస్టమర్​ కేర్​ అంటూ...

సికింద్రాబాద్ బాలంరాయ్​కి చెందిన నాగమల్లేశ్ తన ఫోన్​లో గూగుల్ పే ద్వారా తెలిసిన వారికి డబ్బు పంపించాడు. ఆ డబ్బులు వారి ఖాతాలో జమ కాలేదు. కస్టమర్ కేర్ కోసం అంతర్జాలంలో వెతికి... ఓ నంబర్​కు ఫోన్ చేస్తే స్పందించలేదు. తర్వాత ఆ వ్యక్తే మల్లేశ్​కి ఫోన్​ చేయగా... సమస్యను వివరించాడు. వెంటనే క్విక్ సపోర్ట్ యాప్​ను డౌన్​లోడ్ చేయించి... బాధితుని ఖాతాలోంచి ఏకంగా రూ.2లక్షల 20 వేలు కొట్టేశాడు.

సికింద్రాబాద్​కు చెందిన సాలోమన్​రాజు.. తన గూగుల్​పే సరిగా పనిచేయకపోవటం వల్ల కస్టమర్​కేర్​కు ఫోన్ చేశాడు. మొదట్లో ఎవరూ స్పందించలేదు. తర్వాత కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి అన్ని వివరాలు తెలుసుకుని రూ.86 వేలు దోచేశారు.

రుణమిస్తామని నమ్మించి...

సికింద్రాబాద్​కు చెందిన శివరాజుకు రుణం ఇస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వివరాలు తెలుసుకొని లక్షన్నర వరకు ఇచ్చే వెసులుబాటు ఉందని శివరాజును నమ్మించాడు. ముందుగా జీఎస్టీ కట్టాలని రూ. 24వేలు, ఎన్​వోసీ కోసమని రూ.45 వేలు ఇలా మొత్తం లక్షన్నర తన ఖాతాలో వేయించుకున్నాడు. మళ్లీ ఆ నెంబర్​కి బాధితుడు ఫోన్ చేస్తే స్పందన లేకపోయేసరికి... మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

కేవైసీ అప్​డేట్​ అంటూ...

పద్మారావునగర్​కు చెందిన దిలీప్ కుమార్​కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... పేటీఎం కేవైసీ అప్​డేట్ చేసుకోవాలని సూచించాడు. అందుకు దిలీప్​ సంసిద్ధత వ్యక్తం చేయగా... ఎనీడెస్క్ యాప్​ను డౌన్​లోడ్ చేయించాడు. కొద్దిసేపట్లోనే ఖాతాలోంచి 94 వేల రూపాయలు మాయమయ్యాయి. బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఖాతా అప్​డేట్​ అంటూ...

బోయినపల్లికి చెందిన రమణకు బ్యాంకు అధికారినంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఖాతాను అప్​డేట్ చేసుకోవాలని సూచించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. కొద్దిసేపటిలో ఖాతాలోంచి 1.25 లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు మేసేజ్ రావటంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్​లు వచ్చినప్పుడు వారి చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నిర్వాహకుల అరెస్టు!

ఆన్​లైన్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. సైబర్​ మోసగాళ్ల వలకు చిక్కి అమాయకులు లక్షలు పొగొట్టుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రోజుకు కనీసం 30 నుంచి 50 లక్షల రూపాయలు వరకు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు.

కస్టమర్​ కేర్​ అంటూ...

సికింద్రాబాద్ బాలంరాయ్​కి చెందిన నాగమల్లేశ్ తన ఫోన్​లో గూగుల్ పే ద్వారా తెలిసిన వారికి డబ్బు పంపించాడు. ఆ డబ్బులు వారి ఖాతాలో జమ కాలేదు. కస్టమర్ కేర్ కోసం అంతర్జాలంలో వెతికి... ఓ నంబర్​కు ఫోన్ చేస్తే స్పందించలేదు. తర్వాత ఆ వ్యక్తే మల్లేశ్​కి ఫోన్​ చేయగా... సమస్యను వివరించాడు. వెంటనే క్విక్ సపోర్ట్ యాప్​ను డౌన్​లోడ్ చేయించి... బాధితుని ఖాతాలోంచి ఏకంగా రూ.2లక్షల 20 వేలు కొట్టేశాడు.

సికింద్రాబాద్​కు చెందిన సాలోమన్​రాజు.. తన గూగుల్​పే సరిగా పనిచేయకపోవటం వల్ల కస్టమర్​కేర్​కు ఫోన్ చేశాడు. మొదట్లో ఎవరూ స్పందించలేదు. తర్వాత కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి అన్ని వివరాలు తెలుసుకుని రూ.86 వేలు దోచేశారు.

రుణమిస్తామని నమ్మించి...

సికింద్రాబాద్​కు చెందిన శివరాజుకు రుణం ఇస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వివరాలు తెలుసుకొని లక్షన్నర వరకు ఇచ్చే వెసులుబాటు ఉందని శివరాజును నమ్మించాడు. ముందుగా జీఎస్టీ కట్టాలని రూ. 24వేలు, ఎన్​వోసీ కోసమని రూ.45 వేలు ఇలా మొత్తం లక్షన్నర తన ఖాతాలో వేయించుకున్నాడు. మళ్లీ ఆ నెంబర్​కి బాధితుడు ఫోన్ చేస్తే స్పందన లేకపోయేసరికి... మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

కేవైసీ అప్​డేట్​ అంటూ...

పద్మారావునగర్​కు చెందిన దిలీప్ కుమార్​కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... పేటీఎం కేవైసీ అప్​డేట్ చేసుకోవాలని సూచించాడు. అందుకు దిలీప్​ సంసిద్ధత వ్యక్తం చేయగా... ఎనీడెస్క్ యాప్​ను డౌన్​లోడ్ చేయించాడు. కొద్దిసేపట్లోనే ఖాతాలోంచి 94 వేల రూపాయలు మాయమయ్యాయి. బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఖాతా అప్​డేట్​ అంటూ...

బోయినపల్లికి చెందిన రమణకు బ్యాంకు అధికారినంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఖాతాను అప్​డేట్ చేసుకోవాలని సూచించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. కొద్దిసేపటిలో ఖాతాలోంచి 1.25 లక్షల రూపాయలు డెబిట్ అయినట్లు మేసేజ్ రావటంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్​లు వచ్చినప్పుడు వారి చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నిర్వాహకుల అరెస్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.