ETV Bharat / crime

Ganja seized: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్

Ganja seized: సినిమాల ప్రభావం మనుషులపై ఎంత ప్రభావం చూపిస్తుందనడానికి ఈ ఘటనే ఒక సాక్ష్యం. మీరు పుష్ప సినిమాలో పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా గంజాయిని ఎలా తరలిస్తారో చూసే ఉంటారు. ఇక్కడ సైతం ఇలాగే జరిగింది. కాకపోతే చిన్న ట్విస్ట్ ఉంది. అక్కడ పట్టుకోలేదు.. ఇక్కడ పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ పాల్పడ్డుతున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?

author img

By

Published : Apr 19, 2022, 7:22 AM IST

Ganja seized
సిని ఫక్కీ తరహాలో గంజాయి రవాణా.. కానీ చివరకు

Ganja seized: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. పుష్ప సినిమాలో ఎర్ర చందన అక్రమ రవణాను తలదన్నే రీతిలో గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠా గుట్టురట్టైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తిలో 500కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్​లోని నర్సీంపట్నం నుంచి వరంగల్ వైపు వస్తున్న కారును ఆపి పోలీసుల తనిఖీలు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించంగా ఈ వ్యవహారం బయట పడిందని డీసీపీ తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వెనకవస్తున్న లారీలో సోదాలు చేయగా గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ కిందిభాగంలో కృత్రిమ సెల్ఫ్ ఏర్పాటుచేసి అందులో గంజాయి ప్యాకెట్లు అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా డిజైన్ చేశారు.

దీనితో పాటు కారులో డిక్కీ, సీట్ల కింద 240 ప్యాకెట్లను అమర్చారు. మొత్తం 500 కిలోల గంజాయి గుర్తించినట్లు వెల్లడించారు. నలుగురు నిందితుల్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ సీతారాం తెలియచేశారు.

సిని ఫక్కీ తరహాలో గంజాయి రవాణా.. కానీ చివరకు

ఇదీ చదవండి: మేలుకోకుంటే... మనకూ శ్రీలంక గతే!

Ganja seized: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటం లేదు. పుష్ప సినిమాలో ఎర్ర చందన అక్రమ రవణాను తలదన్నే రీతిలో గంజాయి స్మగ్లింగ్​కు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠా గుట్టురట్టైంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తిలో 500కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్​లోని నర్సీంపట్నం నుంచి వరంగల్ వైపు వస్తున్న కారును ఆపి పోలీసుల తనిఖీలు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించంగా ఈ వ్యవహారం బయట పడిందని డీసీపీ తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వెనకవస్తున్న లారీలో సోదాలు చేయగా గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ కిందిభాగంలో కృత్రిమ సెల్ఫ్ ఏర్పాటుచేసి అందులో గంజాయి ప్యాకెట్లు అమర్చి ఏమాత్రం అనుమానం రాకుండా డిజైన్ చేశారు.

దీనితో పాటు కారులో డిక్కీ, సీట్ల కింద 240 ప్యాకెట్లను అమర్చారు. మొత్తం 500 కిలోల గంజాయి గుర్తించినట్లు వెల్లడించారు. నలుగురు నిందితుల్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ సీతారాం తెలియచేశారు.

సిని ఫక్కీ తరహాలో గంజాయి రవాణా.. కానీ చివరకు

ఇదీ చదవండి: మేలుకోకుంటే... మనకూ శ్రీలంక గతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.