రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. 104 కూడలి బీఆర్టీఎస్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆర్కే బీచ్ సమీపంలో ఓ ఈవెంట్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మర్రిపాలెంకు చెందిన నరసింహా (20) అనే వ్యక్తి ఈవెంట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉంటాడు. గురువారం రాత్రి ఆర్కే బీచ్ సమీపంలో ఓ ఈవెంట్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మర్రిపాలెం లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన గాడి సుధాకర్(12)ను తన ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడుడు.
104 కూడలి వద్దకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో వాహనంపై వస్తున్న కట్టా శివ సూర్య(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సుధాకర్ మరణించాడు. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.