ETV Bharat / city

'మత్స్యకారుల పొట్టకొట్టే జోవో 217ను ఉపసంహరించుకోవాలి' - విజయవాడలో తెదేపా ఆందోళనలు

మత్స్యకారుల పొట్టకొట్టే జోవో 217ను ఉపసంహరించుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో నిరసన తెలిపి ప్రతులను తగులబెట్టారు.

తెదేపా ఆందోళన
తెదేపా ఆందోళన
author img

By

Published : Sep 1, 2021, 12:29 PM IST

మత్యకారులను జగన్​రెడ్డి ప్రభుత్వం మోసగిస్తోందంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 217 మత్స్యకారులకు ఉరితాడు కాబోతోందని చెప్పారు. ఆ జీవో ప్రతులను తగలబెట్టారు. సొసైటీ హక్కులను కాలరాస్తూ మత్స్యకారుల పొట్టగొట్టే విధంగా ఉన్న ఉత్తర్వులను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గత రెండున్నరేళ్లలో మత్స్యకారులకు వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యమని మండిపడ్డారు.

మత్యకారులను జగన్​రెడ్డి ప్రభుత్వం మోసగిస్తోందంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 217 మత్స్యకారులకు ఉరితాడు కాబోతోందని చెప్పారు. ఆ జీవో ప్రతులను తగలబెట్టారు. సొసైటీ హక్కులను కాలరాస్తూ మత్స్యకారుల పొట్టగొట్టే విధంగా ఉన్న ఉత్తర్వులను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గత రెండున్నరేళ్లలో మత్స్యకారులకు వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యమని మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.